News March 28, 2024

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

image

తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ YSR కడప, నంద్యాల, మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

News March 17, 2026

కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

image

సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారు 8391990070కు డయల్ చేయవచ్చు(IVRS). <<19379922>>ఓల్డ్ నంబర్స్<<>> కూడా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది. share it

News March 17, 2026

రంగంలోకి ‘డూమ్స్ డే’ విమానాలు.. వీటి ప్రత్యేకత ఇదే

image

USకు చెందిన శక్తిమంతమైన E-6B మెర్క్యూరీ(డూమ్స్ డే) విమానాలు పశ్చిమాసియాలో మరోసారి కనిపించడం కలకలం రేపింది. అణ్వాయుధ దాడి జరిగి భూమిపైన US సిగ్నలింగ్ వ్యవస్థ నాశనమైనప్పుడే వీటిని రంగంలోకి దించుతారు. 150 ఫీట్ల పొడవుండే ఈ విమానాలు 40వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలవు. ఆకాశంలోనే ఇంధనం నింపుకుంటూ 7K మైళ్లు ప్రయాణించగలవు. ప్రపంచవ్యాప్తంగా US దాచిన క్షిపణులను వీటి ద్వారా ప్రయోగించవచ్చు.