News April 20, 2025
NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు
Similar News
News September 11, 2025
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు: ఏఎస్పీ మౌనిక

ఏప్రిల్లో దేవరకొండలోని హనుమాన్ నగర్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పిట్ట గంగాధరను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దొంగతనంలో రూ. 6 లక్షల నగదు, 2.2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని.. నిందితుడిపై సుమారు 100కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు.
News September 11, 2025
NLG: మద్యం టెండర్లకు కసరత్తు

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News September 11, 2025
NLG: మద్యం టెండర్లకు కసరత్తు

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.