News March 28, 2024

ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ.. అమెరికాలో కలకలం

image

అమెరికాలోని టెక్సస్, కాన్సాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలల్లో బర్డ్ ఫ్లూ ఉందన్న విషయం బయటపడింది. ఇది పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆవులు H5N1 టైప్-A బారిన పడ్డాయని, జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన ఆవుల్లో బద్ధకం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నాయి.

Similar News

News March 28, 2026

మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

image

భారతీయ LPG నిల్వలకు మరింత బూస్ట్ ఇచ్చేందుకు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా వీటికి రక్షణగా భారత నౌకాదళ యుద్ధనౌకలు ఎస్కార్ట్ ఇవ్వనున్నాయి. దేశ ఇంధన అవసరాల కోసం త్వరలోనే మరిన్ని నౌకలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మూడు LPG నౌకలు ఇండియాకు చేరాయి.

News March 28, 2026

జులైలో థియేటర్లలోకి ‘జన నాయకుడు’?

image

తమిళ స్టార్ నటుడు విజయ్, హెచ్ వినోద్ కాంబోలో తెరకెక్కిన ‘జన నాయకుడు’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఉండాల్సిన ఈ చిత్రం సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అన్ని అడ్డంకులను పూర్తిచేసి జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.

News March 28, 2026

వైసీపీ గైర్హాజరు.. జగన్ మదిలో ఏముంది?

image

AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చకూ వైసీపీ గైర్హాజరైంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదు. తమ పార్టీ, జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. మరి ఇవాళ తీర్మానంపై చర్చకైనా ఆ పార్టీ ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అమరావతికి జగన్ అనుకూలంగా లేరా? ఆయన మదిలో ఏముంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.