News March 28, 2024
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ.. అమెరికాలో కలకలం
అమెరికాలోని టెక్సస్, కాన్సాస్తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలల్లో బర్డ్ ఫ్లూ ఉందన్న విషయం బయటపడింది. ఇది పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆవులు H5N1 టైప్-A బారిన పడ్డాయని, జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన ఆవుల్లో బద్ధకం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నాయి.
Similar News
News October 4, 2024
వయసు తగ్గిస్తామని రూ.35కోట్లు నొక్కేశారు
UPలోని కాన్పూర్లో రష్మీ, రాజీవ్ దూబే జంట ‘రివైవల్ వరల్డ్’ పేరుతో ఓ థెరపీ సెంటర్ను నెలకొల్పింది. ఇజ్రాయెల్ టైమ్ మెషీన్తో ఆక్సిజన్ థెరపీ చేసి వృద్ధులను 25ఏళ్ల వారిగా మారుస్తామంటూ నమ్మించింది. ఒక్కో సెషన్కు వారి నుంచి రూ.90వేలు రాబట్టింది. అలా దాదాపు పాతిక మందిని మోసం చేసి వారి నుంచి రూ.35కోట్లు వసూలు చేసింది. మోసాన్ని గుర్తించిన ఓ కస్టమర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
News October 4, 2024
ఎల్లుండి ఇండియాకు రానున్న మయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.
News October 4, 2024
మనకు ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ కీలకం: వాయుసేన చీఫ్
రక్షణ విషయంలో భారత్కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.