News March 28, 2024
పుంగనూరు: 1 నుంచి ఉపాధి కూలీ రూ:300

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గరిష్టంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.300 వేతనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ శన్మోహన్ తెలిపారు. కూలీలు పనిచేసిన పని పరిమాణాన్ని 300 రూపాయలకు మించకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వందరోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Similar News
News March 10, 2026
చల్లా బాబును దూరం పెడుతున్న అధినేత..?

చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా, త్రిసభ్య కమిటీ వేసి, పెద్దిరెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. సరైన నేత ఉంటే 2029 ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట.
News March 10, 2026
125 రోజుల పని దినాల పోస్టర్ ఆవిష్కరణ

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G రామ్ జీ చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. గ్రామీణ కార్మికులకు స్థిరమైన ఉపాధి కల్పన, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 125 రోజుల పనిదినాల అమలుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 10, 2026
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి: మంత్రి మండిపల్లి

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.


