News March 28, 2024

ఆదిలాబాద్: ప్రజలను హడలెత్తిస్తున్న సూర్యుడి భగభగలు

image

వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాల్లో ఆరు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో 42.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా సత్నాలలో 42.3, చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్లో 42.0 , అర్లి(టి)లో 42.0, దస్తురాబాద్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 21, 2025

బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ADB SP

image

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ADB SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం అనంతరం రిపోర్టు దాఖలు చేయాలని సూచించారు.

News April 21, 2025

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

image

సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ADBలోని సాయుధ ముఖ్య కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులను నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

News April 21, 2025

పీసీసీఎఫ్‌గా జిల్లా వాసికి అదనపు బాధ్యతలు

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి కార్యదర్శి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి PCCF, HOFSగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన అటవి శాఖ ప్రధాన కార్యాలయం ఆర్య భవన్‌లో PCCFగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో ఆయన బందువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!