News April 20, 2025

HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

image

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.

Similar News

News July 8, 2025

HYD: బతుకమ్మ కుంట బతికింది!

image

అంబర్‌పేట‌లోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్‌లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?

News July 8, 2025

హైదరాబాద్: వైద్యశాఖలో ఉద్యోగాలు

image

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) కాంట్రాక్ట్ పద్ధతిన 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగా MBBS డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో నమోదు తప్పనిసరి. నెలవారీ వేతనం రూ.52,000 ఉంటుంది. దరఖాస్తులు 09-07-2025 నుంచి 11-07-2025 మధ్య సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి సమర్పించవచ్చు.
SHARE IT

News July 8, 2025

నకిలీ పత్రాలతో దరఖాస్తులు.. JNTU అనుమతులు!

image

కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కళాశాల నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు తీసుకుందని విజిలెన్స్ నివేదికలో తేలినా కౌన్సెలింగ్‌లో మరోసారి అనుమతి ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు పొందుతున్న విద్యాసంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సూచించినా ఇప్పటివరకు JNTU అధికారులు స్పందించకపోవడం గమనార్హం.