News April 20, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ వెల్దుర్తి: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి
☞ వినుకొండ: ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల ప్రదర్శన
☞ ఎడ్లపాడు: అక్రమ మైనింగ్ చేస్తున్న 3JCBలు,18 ట్రాక్టర్లను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
☞ చిలకలూరిపేట: ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజనీకి పోలీసులకు మధ్య వాగ్వాదం
☞ నరసరావుపేట: అగ్నిమాపక వారోత్సవాలు
☞ పెదకూరపాడు: సమాధుల తోటలో ఈస్టర్ ప్రార్థనలు
Similar News
News April 21, 2025
వరంగల్: Wow.. ఆరు తరాల సయింపు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారానికి చెందిన సయింపు కుటుంబానికి చెందిన ఆరు తరాల రక్త సంబంధీకులు ఇటీవల ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేచోట కలుసుకున్నారు. చదువు, ఉద్యోగ అవసరాల కారణంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు.. కుటుంబ సమేతంగా పాల్గొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయత, బంధుత్వం మరింత బలపడేలా ఈ సమావేశం కలిసొచ్చింది.
News April 21, 2025
పాన్గల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

పాన్గల్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న గోప్లాపూర్కి చెందిన గందం చిన్న రాములు ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతుడికి భార్య జ్యోతి, కూతురు ఉన్నారు. కాగా భార్యాభర్తలు ఇద్దరు దివ్యాంగులు కావడంతో పాటు నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
News April 21, 2025
‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్కు ఎంపీ రిప్లై ఇచ్చారు.