News March 28, 2024

ఏలూరు జిల్లాలో బీఎస్పీ అభ్యర్థులు జాబితా

image

ఏలూరు జిల్లాలో బీఎస్పీ పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆచార్య ఎన్‌ఏడీ పాల్‌, ఏలూరు అసెంబ్లీకి అందుగుల రతన్‌కాంత్‌, చింతలపూడి- ఎల్‌.చైతన్య, దెందులూరు – నేత రమేశ్‌ బాబు, ఉంగుటూరు- బుంగా ఏసు, కైకలూరు- మన్నేపల్లి నాగేశ్వరరావు, నూజివీడు – డాక్టర్‌ చెలిగంటి వెంకటేశ్వరరావు, పోలవరం – సరయం వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 9, 2025

ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

image

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

News July 8, 2025

‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

image

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.

News July 8, 2025

ఈనెల 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు: కలెక్టర్

image

పశుగణాభివృద్ధితో పాటు మేలురకం పశుగ్రాసలసాగు ద్వారా అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్ధ్యం పెంపుదలకు ఈనెల 14 వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. పశుగ్రాసం విత్తనాలను పశువైద్యశాలలో రైతుసేవ కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. రేపు వెంకట రామన్నగూడెంలో మేలుజాతి పశుగ్రాసాల ప్రదర్సన, పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.