News April 21, 2025
‘ఖురేషీ’ ముస్లిం ఎన్నికల అధికారి .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీపై BJPఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఖురేషీ కమిషనర్గా ఉన్నకాలంలో ఝార్ఖండ్ సంతాల్ పరగణాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చారని, ఆయన ముస్లిం ఎన్నికల కమిషనర్ అని’ Xలో ఆరోపించారు. కాగా వక్ఫ్ చట్టం ముస్లిం భూములను లాక్కోవడానికి చేసిన ప్లాన్ అని సుప్రీం కోర్టు దానిని గుర్తిస్తుందని ఖురేషీ చేసిన ట్వీట్కు ఎంపీ రిప్లై ఇచ్చారు.
Similar News
News November 17, 2025
గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.
News November 17, 2025
గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.
News November 17, 2025
పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: పొంగులేటి

TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్లు DECలనే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. HC తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.


