News April 21, 2025
IPL: ఇవాళ కీలక పోరు

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News April 21, 2025
త్వరలో అకౌంట్లలోకి డబ్బులు

TG: యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
News April 21, 2025
రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.
News April 21, 2025
KTRకు హైకోర్టులో ఊరట

TG: మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్లో ఆయనపై నమోదైన FIRను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసినట్లు KTR ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఆయనపై కేసు నమోదైంది.