News April 21, 2025
పిట్టలవానిపాలెం: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన ఘటన పిట్టలవానిపాలెం మండలంలో ఆదివారం చోటుచేసుకొంది. చందోలు ఎస్ఐ శివకుమార్ వివరాల మేరకు.. మండలంలోని అలకాపురంలో కనకా రెడ్డి ట్రాక్టర్తో రొయ్యల చెరువు కట్టను వెడల్పు చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడటంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News April 21, 2025
త్వరలో అకౌంట్లలోకి డబ్బులు

TG: యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
News April 21, 2025
రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.
News April 21, 2025
రామకుప్పంలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె వాసి మృతి

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం జల్దిగాని పల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఐ మోహన్ వివరాల మేరకు కారు చెట్టును ఢీకొంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మదనపల్లెకు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్ర మత్తుతో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిపారు.