News April 21, 2025
ఏలూరు: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
Similar News
News April 21, 2025
నాగర్కర్నూల్: ‘పిల్లలను GOVT స్కూళ్లలో చేర్పించండి’

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే సర్కార్ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని ఆ ఉపాధ్యాయ బృందం పేర్కొంది. బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అందించే విద్యాప్రమాణాలు, సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసిపోవని హెచ్ఎం సోమాని ఆధ్వర్యంలో పేరెంట్స్కు అవగాహన కల్పిస్తున్నారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు.
News April 21, 2025
భూభారతి పోర్టల్పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

నేరేడుచర్లలోని సోమవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి పోర్టల్పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. ఈ పోర్టల్లో పది మాడ్యూల్స్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఎఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ పొందుపరిచారని తెలిపారు.
News April 21, 2025
నాగర్కర్నూల్: ఈనెల 17న పదవీ విరమణ.. ఇంతలోనే విషాదం

కల్వకుర్తి పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన <<16167214>>పాపిశెట్టి శ్రీనివాసులు<<>> తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో రిటైర్డ్ అవుతున్నందున ఈనెల 17న పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా జరిపారు. నాలుగు రోజుల్లోనే మృతిచెందడం ఎంతో బాధాకరమని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.