News March 28, 2024

మెట్టుకూరు మెట్టు దిగేనా !

image

వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వెంకటగిరిలో పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు కచ్చితంగా పోటీలో ఉంటానని రాజకీయ కాక రేపారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో వెళ్లారు. కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ఆయన మెత్తబడలేదని సమాచారం.

Similar News

News September 14, 2025

పార్లమెంటులో నెల్లూరు MP పని తీరు ఇదే.!

image

2024- 25వ సంవత్సరానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరును పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్లమెంట్లో ప్రజా సమస్యలపై 73 ప్రశ్నలు సంధించారు. 77.94 శాతం అటెండెన్స్ కల్గి ఉన్నారు. నాలుగు చర్చా కార్యక్రమాలలో పాల్గొని ప్రజావాణి వినిపించినట్లు పార్లమెంట్ వర్గాలు నివేదికను వెల్లడించాయి.

News September 14, 2025

ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ ప్రేమకథ.!

image

ప్రజలకు సేవా చేయాలన్న తపన వారిద్దరిది. IASకు ప్రయత్నించి ఒకరు మొదటి ప్రయత్నంలో, మరొకరు రెండో ప్రయత్నంలో సెలక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ల మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ హిమాన్షు శుక్లా-కృతికా శుక్లా ప్రేమ కథ. ప్రస్తుతం ఆమె పల్నాడు కలెక్టర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఇద్దరూ బాధ్యతలు చేపట్టారు.

News September 14, 2025

కృష్ణాపురం నవోదయలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ దాష్టీకం

image

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్‌లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్‌ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్‌లో లాక్ చేసిన ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్‌ని హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు.