News March 28, 2024
విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డ్

2023-24 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ సరుకు రవాణా ద్వారా రూ3.975కోట్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏకంగా 36.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. త్వరలోనే విజయవాడ రైల్వే డివిజన్ వార్షిక ఆదాయం రూ.4వేల కోట్ల మైలురాయి దాటనుందని వారు తెలిపారు. అనంతరం సరుకు రవాణా కోసం కొత్తగా రూ.153కోట్లతో 15గూడ్స్ షెడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Similar News
News March 25, 2026
అవనిగడ్డ నియోజకవర్గం రెండు అవుతుందా..?

2 లక్షలపైచిలుకు జనాభాతో 6 మండలాలతో విస్తరించి ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంపై పునర్విభజన ఎఫెక్ట్ పడనుంది. సమీప ప్రాంతాలతో కలిపి అవనిగడ్డను రెండు నియోజకవర్గాలుగా విభజించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో కలిపి చల్లపల్లి నియోజకవర్గం ఏర్పడవచ్చని, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలతో ప్రస్తుత అవనిగడ్డ నియోజకవర్గం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
News March 25, 2026
కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం పామర్రు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 24, 2026
కృష్ణా: రెవెన్యూ క్లినిక్ అర్జీలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లో వస్తున్న అర్జీల పరిష్కార చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 430 అర్జీలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 804 అర్జీలు అందగా 106 అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. 207 అర్జీలను రిజక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమీక్షలో జేసీ నవీన్ ఉన్నారు.


