News April 21, 2025
WGL: ప్రారంభమైన మార్కెట్.. అధిక ధర పలికిన పత్తి

మూడు రోజుల సుదీర్ఘ విరమం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి తరలిరాగా భారీ ధర పలికింది. మూడు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,560 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర భారీగా పలకడంతో రైతులకు ఊరట లభించినట్లు అయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News April 21, 2025
రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు?

ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి అని IMDb పేర్కొంది. పారితోషికం, ప్రాఫిట్ షేర్ (కలెక్షన్స్ బట్టి), మూవీ హక్కుల విక్రయం ద్వారా ఈ మేరకు పొందుతారని తెలిపింది. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇతర దర్శకుల్లో సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
News April 21, 2025
బాపట్ల: ఏఎన్ఎమ్ల సమస్యలపై స్పందించిన కలెక్టర్

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎమ్లను సర్వేలు, పింఛన్ల పంపిణీలో తమకి డ్యూటీలు వేస్తున్నారని, ఆరోగ్య శాఖకే పరిమితి చేయాలని కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్లలో పని భారాన్ని ఏఎన్ఎమ్ల పై మోపవద్దని అధికారులను ఆదేశించారు.
News April 21, 2025
కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.