News March 28, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిని ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన 1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.

Similar News

News October 25, 2025

వీణవంక: ప్రేమ వివాహ హత్య.. నలుగురికి జీవిత ఖైదే

image

సంచలనం సృష్టించిన వీణవంక ప్రేమ వివాహ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బ్రాహ్మణపల్లికి చెందిన ఎ.శ్రీనివాస్‌ను 2019లో ఆయన భార్య బంధువులు దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో నలుగురు కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. ఐపీసీ సెక్షన్ 302 r/w 34 కింద తీర్పునిచ్చిన కోర్టు.. నిందితులైన మండల ఓదేలు, సంపత్, దేవేందర్, లక్ష్మిలకు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1,000 జరిమానా విధించింది.

News October 25, 2025

KNR: ‘ఈనెల 30లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి’

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు OCT 30 లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్‌గా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ గడువు లోపు తమ ఫీజు చెల్లించాల్సిందిగా సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో NOV 15 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో DEC 2 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో DEC 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు.

News October 25, 2025

JMKT: మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

JMKT మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.