News April 21, 2025
గ్రూప్-1 మెయిన్స్లో 2 మార్కులెలా?: BRS నేత

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు. ఫలితాల జాబితాను షేర్ చేస్తూ.. ఇందులో కొందరికి 2 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో 90శాతం మందికి 150+ మార్కులు రాగా ఇద్దరికి 2 మార్కులొచ్చాయి. ప్రిలిమ్స్లో సత్తా చాటిన వారికి మెయిన్స్లో ఇంత తక్కువ మార్కులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా దీనిపై TGPSC ఎలా స్పందిస్తో చూడాల్సి ఉంది.
Similar News
News August 6, 2025
ప్రకటనలు, సంక్షేమ పథకాల్లో CM ఫొటో ఉండొచ్చు: సుప్రీం తీర్పు

సంక్షేమ పథకాల్లో CMల పేర్లు, ఫొటోలు వాడొద్దన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. CM ఫొటో వాడుకోవచ్చని CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సంక్షేమ పథకాలకు CM పేరు, ఫొటోలు వాడటంపై AIDMK హైకోర్టును ఆశ్రయించగా వాడొద్దని తీర్పు వచ్చింది. దీనిని TN GOVT SCలో సవాల్ చేయడంతో పైవిధంగా తీర్పు ఇచ్చింది. రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దని AIDMK నేతకు రూ.10లక్షల ఫైన్ వేసింది.
News August 6, 2025
యూపీఐ ఎప్పటికీ ఉచితమని చెప్పలేదు: RBI గవర్నర్

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. ‘యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ’ అని పేర్కొన్నారు.
News August 6, 2025
బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు: భట్టి

TG: బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రిజర్వేషన్లు సాధిస్తామనే నమ్మకం ఉందని, కేంద్రం త్వరగా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్కు అన్ని కులాలు, మతాలు సమానమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల విషయంలో BJP డబుల్ గేమ్ ఆడుతోందని TPCC చీఫ్ మహేశ్ ఫైరయ్యారు.