News April 21, 2025

JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

image

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

Similar News

News August 7, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

News August 7, 2025

‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు?

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే ఎలక్షన్స్‌కు వెళ్తామని CM రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడమే INC ముందున్న అవకాశం. మరి రేవంత్ త్వరలోనే ఆ దిశగా ఎన్నికలకు వెళ్తారా? లేక కేంద్రం స్పందన కోసం ఇంకా వేచి చూస్తారా? అనేది తేలాలి. అటు గ్రామాల్లో పాలకవర్గాల కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

News August 7, 2025

రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినా, చాలా స్కూళ్లు సెలవు ఇవ్వలేదు. పబ్లిక్ హాలిడే ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు?