News April 21, 2025

డోలీ మోతలు లేకుండా చేస్తాం: మంత్రి సంధ్యారాణి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కించుమాందాలో రూ. 440 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్‌ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగని మంత్రి తెలిపారు. డోలీ మోతలు లేకుండా అన్ని గిరిజన తండాలకు రోడ్లు వేస్తామని తెలిపారు. ప్రజలు, అధికారులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News April 21, 2025

అమరావతిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే

image

AP: మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.

News April 21, 2025

IPL 2025: 400+ రన్స్ చేసిన సాయి సుదర్శన్

image

గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లోనూ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. KKRతో జరుగుతున్న మ్యాచుతో అర్ధసెంచరీ చేసిన ఆయన IPL 2025లో 400కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచుల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు చేశారు.

News April 21, 2025

తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

image

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)

error: Content is protected !!