News April 21, 2025
భారతీయుల పట్ల పోప్కు ఉన్న ఆప్యాయతను మరచిపోం: పీఎం మోదీ

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల పోప్కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోమని అన్నారు. ‘పోప్ ఫ్రాన్సిస్ మృతి చాలా బాధను కలిగించింది. ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం. జాలి, దయ, వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాదిమంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News August 7, 2025
ఈసీపై రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: BJP

ECపై సంచలన <<17330640>>వ్యాఖ్యలు<<>> చేసిన INC నేత రాహుల్ గాంధీపై BJP ధ్వజమెత్తింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని, ప్రజల తీర్పును ఆయన అవమానిస్తున్నారని దుయ్యబట్టింది. కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఇవ్వకపోవడంతో రాహుల్లో కోపం, అసహనం పెరిగిపోయాయని BJP MP రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. అందుకే ECపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనది ఇలాంటి క్యారెక్టర్ కాబట్టే ప్రజలు INCని పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు.
News August 7, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
News August 7, 2025
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు?

TG: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే ఎలక్షన్స్కు వెళ్తామని CM రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండిపోయింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడమే INC ముందున్న అవకాశం. మరి రేవంత్ త్వరలోనే ఆ దిశగా ఎన్నికలకు వెళ్తారా? లేక కేంద్రం స్పందన కోసం ఇంకా వేచి చూస్తారా? అనేది తేలాలి. అటు గ్రామాల్లో పాలకవర్గాల కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.