News April 21, 2025

బాపట్ల: ఏఎన్ఎమ్‌ల సమస్యలపై స్పందించిన కలెక్టర్

image

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎమ్‌లను సర్వేలు, పింఛన్ల పంపిణీలో తమకి డ్యూటీలు వేస్తున్నారని, ఆరోగ్య శాఖకే పరిమితి చేయాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్లలో పని భారాన్ని ఏఎన్ఎమ్‌ల పై మోపవద్దని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 22, 2025

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. భారత్‌లో 3 రోజులు సంతాప దినాలు

image

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల గౌరవ సూచకంగా కేంద్రం మూడ్రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఈ నెల 22, 23 తేదీలు, అలాగే అంత్యక్రియలు నిర్వహించే రోజును కూడా సంతాప దినంగానే ప్రకటించింది. ఈ మూడ్రోజులు జాతీయ జెండాను సగం ఎత్తులోనే ఎగరవేయాలంది. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

News April 22, 2025

నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

News April 22, 2025

గుంటూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ 

image

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో గుంటూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 150 పరీక్షా కేంద్రాల్లో 29,459 మంది రెగ్యులర్, ప్రైవేటుగా మరో 961 మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ… ఒక్కో సెకనూ గంటలా మారింది. ప్రతి ఒక్కరికీ తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. ఎన్నో లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

error: Content is protected !!