News April 21, 2025

బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ADB SP

image

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ADB SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం అనంతరం రిపోర్టు దాఖలు చేయాలని సూచించారు.

Similar News

News September 10, 2025

ఆదిలాబాద్: INTERలో చేరేందుకు మరో అవకాశం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేందుకు మరొకసారి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ డీఐఈఓ జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలనుకుంటే ఈనెల 11, 12 తేదీల్లో అడ్మిషన్ పొందాలని సూచించారు. అలాగే లాంగ్వేజ్ మార్పు చేసుకునేందుకు కూడా ఈ రెండు రోజులే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 10, 2025

గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

ADB జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్టర్ మోహన్‌ను నియమించారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనుండగా… ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

News September 10, 2025

నార్నూర్ కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

image

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు విద్యాధికారి పవార్ అనిత, తహశీల్దార్ రాజలింగం తదితరులు ఉన్నారు.