News April 21, 2025

‘లగచర్ల’లో మేం చెబుతున్న విషయాన్నే NHRC బయటపెట్టింది: కేటీఆర్

image

TG: లగచర్ల ఘటనలో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇంతకాలంగా మేం చెబుతున్నదీ అదే. లగచర్లలో రైతులు, మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మానవ హక్కుల హననానికి పాల్పడ్డారు. ఆ విషయాన్నే నివేదిక ఖరారు చేసింది. సర్కారుపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు’ అని తెలిపారు.

Similar News

News August 8, 2025

ఆగస్టు 11న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!

image

ఈ ఏడాది FEBలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025ను కేంద్రం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అప్డేట్ చేసి ఆగస్టు 11న కొత్త బిల్లు తీసుకురానున్నట్లు సమాచారం. 1961 IT చట్టం స్థానంలో కొత్త బిల్లు తేవాలని FEBలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని సెలక్ట్ కమిటీకి పంపగా కొన్ని మార్పులు సూచించింది. వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకొని అప్డేట్ బిల్లు తెస్తున్నట్లు సమాచారం.

News August 8, 2025

‘కాంతార’ను వెంటాడుతున్న విషాదాలు

image

కాంతార మూవీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పార్ట్ 1లో నటించిన <<17341034>>ప్రభాకర్ కళ్యాణ్<<>> మరణించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ఈ చిత్రంలో నటించిన, నటిస్తున్న ఆర్టిస్టులు చనిపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మేలో రాకేశ్ పూజారి(34), కపిల్(32), జూన్‌లో కళాభవన్(43), తాజాగా ప్రభాకర్ కళ్యాణ్ మరణించారు. కారణమేదైనా కాంతారను విషాదాలు వదలట్లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

News August 8, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

image

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స గరిష్ఠంగా 7 రోజుల వరకు వర్తిస్తుంది. మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా ఈ పథకానికి అర్హులే. SHARE IT