News April 21, 2025

అనకాపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 320 అర్జీలు: జేసీ

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు 320 అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ.. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు.

Similar News

News January 6, 2026

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలి: కలెక్టర్

image

నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీల్లో నిర్మల్ ఉత్సవాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News January 6, 2026

డీసీసీబీని అభివృద్ధి పథంలో నడిపించాలి: కలెక్టర్

image

జిల్లా సహకార పరపతి బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె బ్యాంకును సందర్శించి, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. రికవరీల శాతం పెంచాలని, డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం బ్యాంకు క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, సిబ్బంది అంకితభావంతో పనిచేసి బ్యాంకును బలోపేతం చేయాలని కోరారు.

News January 6, 2026

వెనిజులా తర్వాత.. ఈ దేశాలే ట్రంప్ టార్గెట్?

image

వెనిజులాపై <<18751661>>దాడి<<>> చేసి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అలజడి సృష్టించారు. ఇప్పుడు ఆయన గ్రీన్లాండ్, కొలంబియా, ఇరాన్, మెక్సికో, క్యూబాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆయన గుర్రుగా ఉన్నారు. <<18742175>>అటాక్‌కు సిద్ధమని<<>> ఇటీవల హెచ్చరించారు. గ్రీన్లాండ్‌లోని ఐస్‌ల్యాండ్‌పై కన్నేశారు. క్యూబా దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మిగిలింది. కొలంబియా, మెక్సికో డ్రగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.