News April 21, 2025
అమరావతిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే

AP: మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.
Similar News
News August 9, 2025
PHOTOS: సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్

రాఖీ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు రాఖీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రకుల్ ప్రీత్, జెనీలియా, నిహారిక, సారా అలీ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News August 9, 2025
మూడు విడతల్లో వేతనాల పెంపు: నిర్మాతలు

సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. వేతనం రూ.2వేల(రోజుకు) లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే 30శాతం పెంపునకు సుముఖంగా లేమని తెలిపారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5, మూడో విడతలోనూ 5% పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్పష్టం చేశారు. ఇక కార్మిక ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు.
News August 9, 2025
వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వండి: బొత్స

AP: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని, ఆ సమయంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలి. విశాఖ భూదోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని వెనుక పెద్దల హస్తం ఉంది’ అని బొత్స ఆరోపించారు.