News April 22, 2025
రెజిల్మేనియాకు వెళ్లిన తొలి భారత సెలబ్రిటీగా రానా

రెజిల్మేనియా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. లాస్ వెగాస్లో జరిగిన రెజిల్మేనియా-41కి నటుడు రానా దగ్గుబాటి తాజాగా హాజరయ్యారు. ఆయన్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహకులు ముందు వరుస సీటింగ్ను కేటాయించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు రానా పేరును వారు అనౌన్స్ చేయడం విశేషం. రెజిల్మేనియాకు హాజరైన తొలి భారత సెలబ్రిటీగా రానా చరిత్ర సృష్టించారు.
Similar News
News April 22, 2025
ఎల్లుండి నుంచి సెలవులు

APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి(APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. హాలిడేస్లో పిల్లలకు తరగతులు నిర్వహించరాదని అధికారులు ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
News April 22, 2025
ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.12 గంటలకు Dy.CM భట్టి విక్రమార్క రిజల్ట్స్ను ప్రకటిస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 9.96 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకే క్లిక్తో రిజల్ట్స్ వస్తాయి. మార్కుల జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు.
News April 22, 2025
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించాలని విజ్ఞప్తి

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసింది. కాగా APR 30 వరకు పొడిగించాలని Dy.CM భట్టిని EBC నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం.