News April 22, 2025
HEADLINES TODAY

‣‣ AP: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్, హాల్ టికెట్ల విడుదల,
‣‣ AP: ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
‣‣ AP: 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు
‣‣ TG: రేపు ఇంటర్ ఫలితాలు
‣‣ TG: జపాన్ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ భేటీ
‣‣ TG: లగచర్ల ఘటనలో NHRC నివేదిక కూడా మేం చెప్పినట్లే వచ్చింది: కేటీఆర్
‣‣ రూ.లక్షకు చేరిన బంగారం ధర
‣‣ ప్రధాని మోదీతో జేడీ వాన్స్ దంపతుల భేటీ
Similar News
News August 8, 2025
నీట్, జేఈఈ విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్

నీట్, జేఈఈ-2026 ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ను సిద్ధం చేసినట్లు ఐఐటీ/జేఈఈ ఫోరం తెలిపింది. ఇందులో స్టడీ మెటీరియల్, గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్, ‘కోటా’ ప్రీవియస్ టెస్టులు, NCERT నీట్ క్వశ్చన్ బ్యాంక్ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. పూర్తి సమాచారానికి 9849016661 నంబర్ వాట్సాప్లో మెసేజ్ చేయాలని సూచించింది.
News August 8, 2025
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించింది. అనుభవం తప్పనిసరి. కనిష్ఠ వయోపరిమితి 24 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్లుగా పేర్కొంది. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ.850, మహిళా అభ్యర్థులు, ఇతరులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
News August 8, 2025
చైనాపై టారిఫ్స్ పెంచాలంటే ట్రంప్ వణుకు.. కారణమిదేనా?

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా చైనాపై సుంకాలు పెంచేందుకు ట్రంప్ భయపడుతున్నారు. ప్రస్తుతం చైనా వస్తువులపై 30% టారిఫ్స్ విధిస్తున్నారు. USలోని ప్రముఖ ఆటోమొబైల్, టెక్ కంపెనీలకు చైనా అరుదైన ముడి సరుకులు సప్లై చేస్తోంది. టారిఫ్స్ పెంచితే ధరలు పెరుగుతాయి. అమెరికాను శాసించే బడా కంపెనీలు దీనికి సిద్ధంగా లేవు. ఒకవేళ ట్రంప్ ఆ పని చేస్తే వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.