News April 22, 2025
నిర్మల్: GOOD NEWS.. 25న జాబ్ మేళా

ఇంటర్ విద్యార్థులకు HCL TechBee సంస్థ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ మేళా ఉంటుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ జాదవ్ పరశురాం సోమవారం తెలిపారు. ఈనెల 25 పట్టణంలోని ఎస్ఎస్ కంప్యూటర్ ఆఫ్ టెక్నాలజీ న్యూ బస్టాండ్ వద్ద డ్రైవ్ ఉంటుందన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ విద్యార్థులు రావాలన్నారు. కనీస ఉత్తీర్ణత శాతం 75గా ఉన్నావారు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
లిక్కర్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్: VSR

AP: లిక్కర్ స్కామ్లో తాను ఒక్క రూపాయీ ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్(సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తి). దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అని తెలిపారు.
News April 22, 2025
పర్యాటక కేంద్రంగా అనంతగిరి అభివృద్ధి: డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్

పర్యాటక కేంద్రంగా ఉన్న అనంతగిరి జూన్ చివరి నాటికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. కోటి నలభై లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం జూన్ చివరి వారంలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
News April 22, 2025
శ్రీరాంపూర్: రక్షిత మంచి నీటిని అందించాలి:TBGKS

సింగరేణి సంస్థలో మెడికల్ రిఫరల్ విధానాన్ని సులభతరం చేసి కార్మికులకు అనువైన మెడికల్ విధానాన్ని అమలు చేయాలని TBGKSయూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీ రాంపూర్ ఏరియా SRP-3&3Aగని మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..బెల్లంపల్లి రీజియన్ లోని కార్మికుల కుటుంబాలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులు, కుటుంబాలకు సంక్షేమ చర్యలు విస్తృతపరచాలన్నారు.