News April 22, 2025

నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

image

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.

Similar News

News November 18, 2025

హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్!

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నారు. “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్‌లో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలిచ్చారు. ఆ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.

News November 18, 2025

హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్!

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నారు. “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్‌లో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలిచ్చారు. ఆ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.

News November 18, 2025

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.