News April 22, 2025

‘ఫసల్ భీమా’ యోజన అమలు చేయాలి: ఎమ్మెల్సీ

image

తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ‘ఫసల్ భీమా’ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు జరుగుతుంది అంజిరెడ్డి అన్నారు.

Similar News

News April 22, 2025

HYD: అమర్నాథ్ యాత్ర.. ఇవి తప్పనిసరి!

image

అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్‌తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్‌ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు. 
SHARE IT

News April 22, 2025

జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

image

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.

News April 22, 2025

సంజామల పోలీసులు నన్ను కొట్టారు: అల్లూరి రమేశ్‌

image

ఓ వ్యక్తి గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లగా పోలీసులు వాతలు పడేలా కొట్టిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో PDTR-KNL వెళ్లే బస్సును నొస్సంలో భరత్ అనే యువకుడు ఆపడంతో, కండక్టర్ శాంతతో వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భరత్‌ను కాకుండా తనను అకారణంగా కొట్టారని రమేశ్‌ ఆరోపించారు. బాధితుడు JMDలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో తప్పెవరిదనే నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!