News April 22, 2025

మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Similar News

News August 8, 2025

ఈ నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ.. కెప్టెన్లు వీరే

image

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2025 ఈ నెల 28 నుంచి బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్‌లో జరగనుంది. నార్త్ జోన్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, సెంట్రల్ జోన్‌కు ధ్రువ్ జురెల్, ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్, సౌత్ జోన్‌కు తిలక్ వర్మ, వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్లుగా నియమించారు. వీరిలో ఎవరైనా జాతీయ జట్టుకు ఆడాల్సి వస్తే ఆయా ప్లేయర్ల స్థానాలను వేరే ఆటగాళ్లతో భర్తీ చేస్తారు.

News August 8, 2025

HYDలో వర్షాలు.. అత్యవసర హెల్ప్‌లైన్లు ఇవే

image

హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రోడ్లను వరద ముంచెత్తుతోంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. వర్షం, వరద సమయంలో ఏదైనా సాయం అవసరమైతే సంప్రదించాలని సూచిస్తూ అధికారులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు. పైనున్న ఫొటోలో వివరాలు ఉన్నాయి.

News August 8, 2025

EP30: ఇలా చేస్తే శత్రువులు కూడా ప్రశంసిస్తారు: చాణక్య నీతి

image

తెలివి, జ్ఞానం ఉన్న వారికి అన్ని చోట్ల గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. ‘జీవితంలో ప్రతి దశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. నిజాయితీగా, సంస్కారవంతంగా ఉంటే ఎవరూ మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. చేసే ప్రతీ పనిని ప్రేమించాలి. గొప్ప నైపుణ్యాలు ప్రదర్శిస్తే సంబంధిత రంగాల్లో గౌరవం, డబ్బు లభిస్తాయి. నైపుణ్యాలు చూసి శత్రువులూ ప్రశంసిస్తారు’ అని బోధిస్తోంది.