News April 22, 2025

నరసరావుపేటలో గంజాయి తాగి వ్యక్తి హల్చల్

image

నరసరావుపేటలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. సోమవారం రాత్రి బరంపేట స్కూల్ వద్ద తనకు గంజాయి కావాలంటూ దుకాణంలో ప్రవేశించి మహిళను బెదిరిస్తూ యువకుడు హల్చల్ చేశాడు. తమ వద్ద గంజాయి లేదని చెప్పినా వినిపించుకోకుండా మహిళతో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. వారించిన స్థానికులపై రాళ్లతో దాడి చేసి భయాందోళనకు గురిచేశాడు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News April 22, 2025

INTER RESULTS.. జనగామలో ఎంత మంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో జనగామ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 4,077 మంది పరీక్షలు రాయగా 2,634 మంది ఉత్తీర్ణత సాధించారు. 64.61 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 4,251 మంది విద్యార్థులకు 2,286 మంది ఉత్తీర్ణులు కాగా.. 53.78 పాస్ పర్సంటేజీ నమోదైంది.

News April 22, 2025

INTER RESULTS.. హనుమకొండలో ఎంత మంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో హనుమకొండ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 18,479 మంది పరీక్షలు రాయగా 13,601 మంది ఉత్తీర్ణత సాధించారు. 73.60 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 19,543 మంది విద్యార్థులకు 13,601 మంది ఉత్తీర్ణులు కాగా.. 69.60 పాస్ పర్సంటేజీ నమోదైంది.

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు నిరాశ

image

ఇంటర్ ఫలితాల్లో మన హైదరాబాద్‌ విద్యార్థులు నిరాశ పరిచారు. ఫస్టియర్‌లో 66.68 శాతంతో సరిపెట్టుకున్నారు. 85,772 మంది పరీక్ష రాశారు. ఇందులో 57,197 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో విద్యార్థుల కాస్త మెరుగుపడ్డారు. 74,781 మంది పాస్ పరీక్ష రాయగా.. 50,659 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్, రంగారెడ్డి విద్యార్థులు సత్తాచాటారు. టాప్‌ 10లోనూ మన హైదరాబాద్‌ పేరు లేకపోవడం గమనార్హం.

error: Content is protected !!