News March 28, 2024
జపానా మజాకా.. ల్యాండర్ మళ్లీ మేల్కొంది!
జనవరిలో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన జపాన్ ల్యాండర్ ఇంకా సమర్థంగా పనిచేస్తుండటం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ప్లాన్ ప్రకారం ల్యాండింగ్ జరగకున్నా విజయవంతంగా పనిచేయసాగింది. రెండు వారాల లూనార్ నైట్ తర్వాత యాక్టివేటై జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీకి (JAXA) ఫొటోలు పంపింది. తాజాగా మరో 2 వారాల లూనార్ నైట్ పూర్తిచేసుకున్న ల్యాండర్ మళ్లీ మేల్కొంది. ఈ లేటెస్ట్ ఫొటోలను JAXA ఎక్స్లో షేర్ చేసింది.
Similar News
News October 4, 2024
టాస్ ఓడిన టీమ్ ఇండియా
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.
News October 4, 2024
భారీ ఎన్కౌంటర్.. 30 మంది మావోలు మృతి
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
News October 4, 2024
తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.