News April 22, 2025

పెద్దపల్లి: ఆర్ఎంపీలకు వైద్య అధికారిణి హెచ్చరిక

image

పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎంపీలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి అన్న ప్రసన్న కుమారి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్ఎంపీలు తమ పరిధిలోనే ఉండాలని, కేవలం ప్రథమ చికిత్సకే పరిమితమవ్వాలని సూచించారు. అనధికారికంగా మేజర్ చికిత్సలు చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News April 22, 2025

‘ఆ టీచర్లను ఉన్నత పాఠశాలలోనే కొనసాగించాలి’

image

మిగులు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలోనే కొనసాగించాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస రాజు కోరారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 117 ఉత్తర్వు రద్దు ద్వారా ఉన్నత పాఠశాలలో అనేకమంది గణితం, తెలుగు, ఆంగ్లం, సాంఘిక శాస్త్ర పాఠశాల సహాయకులు ఎక్కువ సంఖ్యలో మిగులు ఉపాధ్యాయులుగా తేలుతున్నట్లు చెప్పారు.

News April 22, 2025

‘హజ్ యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి’

image

హజ్ హౌస్‌లో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 11,000 మంది హజ్ యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏప్రిల్ 29 నుంచి మే 29 వరకు విమానాలు మదీనా, జిద్దా వెళ్లనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 9 వరకు తిరుగు ప్రయాణాల షెడ్యూల్ ఉంది.

News April 22, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> జిల్లా వ్యాప్తంగా ముగిసిన పోషణ పక్షం కార్యక్రమాలు
> చిల్పూర్ తహశీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది: రమేశ్
> భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
> సాధారణ మహిళగా కూరగాయలు కొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> రాజీవ్ యువ వికాసం పథకంలో పారదర్శకంగా వ్యవహరించాలి: కలెక్టర్

error: Content is protected !!