News April 22, 2025
గంట వ్యవధిలోనే మళ్లీ పెరిగిన బంగారం ధర!

లైవ్ మార్కెట్లో బంగారం ధరలు నిమిష-నిమిషానికి మారుతూ ఆల్ టైమ్ రికార్డును చేరుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్షకు చేరగా గంట తేడాలోనే మరోసారి భారీగా పెరిగింది. ఇవాళ ఏకంగా రూ.3వేలు పెరిగి రూ.1,01,350కు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 పెరిగి రూ.92,900కు చేరింది.
Similar News
News August 7, 2025
NRPT: నేసినది కాదిది… సంప్రదాయాన్ని మోసిన చీర ఇదీ!

124 ఏళ్లకు పైగా చరిత్ర.. దేశవ్యాప్తంగా గుర్తింపు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెచ్చిన చీరలే NRPT చీరలు. కోటకొండ వాసి యంగలి వెంకట్రాములు మగ్గంపై కుట్టులేని జాతీయ పతాకం నేసి ఘనత పొందారు. రుద్రాక్ష, కోటకొమ్మ, నివాళి, శంభు బార్డర్లు యువతకూ నచ్చేలా మారుస్తున్నారు. పేట పట్టు, కాటన్ చీరలకు ఎంతో ఫేమస్. జిల్లాలో 5 వేలకు పైగా నేతన్నలుండగా, 735 మగ్గాలకు జీయో ట్యాగింగ్ పూర్తైంది.
#నేడు జాతీయ చేనేత దినోత్సవం
News August 7, 2025
రాజగోపాల్ రెడ్డికి నోటీసులు?

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారు. రేవంత్పై విమర్శల మీద వివరణ కోరనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
News August 7, 2025
బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తింటే ఎన్ని లాభాలో..

ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందని, దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని తెలిపారు. అలాగే B12, D, A, E, B6 విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కండరాల బలం, కంటి చూపు, మెదడు, కాలేయం ఆరోగ్యం కోసం ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారంతో కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
SHARE IT