News April 22, 2025
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో నిర్మల్కు 20వ ర్యాంక్

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో 58.78% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 20వ స్థానం సాధించినట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. బాలురు 2421 పరీక్షకు హాజరుకాగా 1054 (43.54) ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలికలు 3062 పరీక్షరాయగా 2169 (70.84) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఓవరాల్గా 5483 విద్యార్థులు పరీక్ష హాజరుకాగా 3223 విద్యార్థులు 58.78 శాతంతో ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News April 23, 2025
గుంటూరు యువకుడిపై.. కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.
News April 23, 2025
గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
News April 23, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నర్సింగ్ బట్లకి చెందిన రవి (30) పెళ్లి మండపం కట్టడానికి మంగళవారం రాత్రి మిర్యాలగూడ వెళ్లాడు. ఈ తెల్లవారుజామున బైక్పై తిరిగి వస్తుండగా డివైడర్ను ఢీకొట్టి కిందపడ్డాడు. అతని పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ఆస్పత్రికి తరలించారు.