News April 22, 2025
అల్లూరి: ‘25.50 లక్షల బుక్స్ అవసరం’

పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చెస్తుందని DEO బ్రాహ్మజిరావు మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 2,913 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో 1,69,175 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి 25.50 లక్షల బుక్స్ అవసరం అని తెలిపారు. ఈ నివేదిక ప్రభుత్వానికి పంపామని చెప్పారు.
Similar News
News April 23, 2025
NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

తల్లి క్యాన్సర్తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
News April 23, 2025
నిర్మల్: ఇంటర్ ఫలితాల్లో మారిన జిల్లాస్థానం

ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత స్థానంలో మార్పు సాధించింది. గతేడాది ఫస్టియర్లో నిర్మల్ జిల్లా 56% ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలువగా ఈసారి 70.87%తో 17వ స్థానానికి చేరింది. సెకండియర్లో గతేడాది 66% ఉత్తీర్ణతతో 12వ స్థానంలో ఉండగా.. ఈసారి 58.78% ఉత్తీర్ణతతో పదో స్థానం కైవసం చేసుకుంది.
News April 23, 2025
జన్నారం: గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

జన్నారం మండలం పొనకల్కు చెందిన రాజేశ్, సమీర్, వినయ్, మందపల్లికి చెందిన బాలాజీ గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. వారి నుంచి1.020 కిలోల గంజాయి, రూ.50 వేల నగదు, హోండా యాక్టివా, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణా చేసిన తాగిన చర్యలు తప్పవన్నారు.