News April 22, 2025

ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

image

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 18, 2026

పోలీసులకు వారాంతపు సెలవులపై చర్యలు తీసుకోవాలి: ADB SP

image

పోలీసులకు వారాంతపు సెలవులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లే సందర్భంలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమాచారం అందించిన సిబ్బందికి ప్రోత్సహిస్తామన్నారు.

News April 18, 2026

MNCL: 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పదవ తరగతిలో 654 మంది, ఇంటర్‌లో 1226 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 18, 2026

పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

image

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్‌ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.