News April 22, 2025
సిద్దిపేట: ఈతకు వెళ్లి యువకుడు మృతి

చెరువులోకి ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. మండలంలోని పెద్ద చీకోడు గ్రామానికి చెందిన తౌడ బాబు(22) కమ్మరపల్లి పెద్ద చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడని తెలిపారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 12, 2026
హనుమకొండ: చైనా మాంజా.. 36 కేసులు నమోదు

పక్షులతోపాటు ప్రజలకు ప్రమాదకరంగా మారిన నిషేధిత చైనా మాంజా సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు 36 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సూమారు రూ.12 లక్షల విలువైన చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News January 12, 2026
పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం: CBN

AP: గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM CBN ప్రకటించారు. ‘ఇది పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీపడలేదు. ఏటా 3వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. 2 తెలుగు రాష్ట్రాలూ ఈ జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. పోలవరంలో మిగిలే నీళ్లను TG కూడా వినియోగించుకోవచ్చు. నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు ’ అని CM తెలిపారు.
News January 12, 2026
NTR: జోగి సోదరులకు రిమాండ్ పొడిగింపు

విజయవాడ నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ ఆయన సోదరులకు సోమవారం ఎక్సైజ్ కోర్ట్ ఈ నెల 23 వరకు రిమాండ్ వేధించింది. నేటితో రిమాండ్ ముగియడంతో మరోసారి జోగి రమేశ్, రామును ఎక్సైజ్ కోర్టులో సోమవారం అధికారులు హాజరు పరిచారు. దీంతో జోగి రమేశ్ సోదరులను ఎక్సైజ్ అధికారులు విజయవాడ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.


