News April 22, 2025
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం

మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ పని కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి మే 14లోగా ఆర్ఎఫ్పీలు (ప్రతిపాదనలు) కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం నిర్మాణంతో పాటు అక్కడి ప్రధాన రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ డిజైన్కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.
Similar News
News April 23, 2025
గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
News April 23, 2025
24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.
News April 23, 2025
అమరావతి: ఒకప్పటి ధాన్యకటకం గురించి తెలుసా..?

అమరావతి ప్రాచీనంగా ధాన్యకటకం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో(సా.శ. 1వ శతాబ్దం) ఈప్రాంతం బౌద్ధ, జైన మతాలకు ప్రముఖ కేంద్రంగా మారింది. బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధరామాలు, స్థూపాలు అమరావతిని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. శాతవాహన పాలకులు దీన్ని రాజధానిగా వాడారు. బౌద్ధుడి కాలచక్ర బోధనలకు కేంద్రంగా అమరావతి నిలిచింది. వజ్రయాన గ్రంథాల్లో అమరావతికి చారిత్రక ప్రామాణికత ఉంది.