News April 22, 2025
శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.
Similar News
News February 20, 2026
శ్రీకాకుళంలో మర్చి 13 నుంచి రెవెన్యూ క్రీడలు

శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులతో క్రీడలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News February 20, 2026
SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.
News February 20, 2026
SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.


