News April 22, 2025
ఉగ్రదాడి కారకులను వదలం: కిషన్ రెడ్డి

TG: జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి కారకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని ట్వీట్ చేశారు. ‘అమాయకులపై దాడి ఉగ్రవాదుల పిరికిపంద చర్య. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుంది. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
3 లక్షల గృహాలకు ప్రారంభోత్సవాలు.. ఎప్పుడంటే?

AP: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12కు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది. పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు.
News April 23, 2025
పహల్గామ్లో అనుమానాస్పద బైక్ గుర్తింపు

జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన విచారణలో భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. పహల్గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్ను గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. బైక్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.
News April 23, 2025
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

IPLలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్ల్లోనే 5,000 పరుగులు చేసిన ప్లేయర్గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న LSGతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ(57*) చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(135Inns), విరాట్ కోహ్లీ(157Inns), డివిలియర్స్(161Inns), ధవన్(168Inns) ఉన్నారు.