News March 28, 2024
BREAKING: ఎర్రవల్లి ఫామ్ హౌజ్కు కేకే

TG: బీఆర్ఎస్ అగ్రనేత కే.కేశవరావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌజ్కు వెళ్లారు. అక్కడ పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయన పార్టీని వీడి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.
Similar News
News March 16, 2026
ఆగిన ఎగుమతులు.. కుప్పకూలిన అరటి ధరలు

AP: పశ్చిమాసియాలో యుద్ధంతో అరటి రైతులు కుదేలవుతున్నారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 2 వారాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ నెల ఆరంభంలో టన్ను ధర రూ.20-23వేలు ఉండగా ప్రస్తుతం రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. వార్ ఇలాగే కొనసాగితే రేట్లు మరింత పతనమవుతాయని అంచనా. రాయలసీమలో దాదాపు లక్ష ఎకరాల్లో అరటి సాగవుతుంది.
News March 16, 2026
ఆస్కార్-2026 విజేతలు..

*ఉత్తమ సహాయ నటి – ఎమీ మ్యాడిగన్(వెపన్స్)
*బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
*బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్(క్రిస్ లావిస్, మసీక్ జెజెర్బోవ్స్కీ)
*బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – కేట్ హాలే(ఫ్రాంకెన్స్టైన్)
*మేకప్ & హెయిర్ స్టైల్ – మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్స్టైన్)
News March 16, 2026
నేటి నుంచి ఏపీలో పది పరీక్షలు.. ఇవి చూసుకోండి

APలో టెన్త్ పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30-మ.12.45 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10AM వరకు అనుమతిస్తారు. OMR షీట్పై ఫొటో, పేరు, నంబరును తప్పకుండా సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్లెట్లో జవాబులు రాశాక అవసరమైతే మరో 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది.#ALL THE BEST


