News April 22, 2025
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్

AP: YCP నేత, MLC దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ CM, ఆ పార్టీ అధినేత YS జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Similar News
News August 7, 2025
దూర ప్రయాణాలు చేసే వారి కోసం త్వరలో ఎమినిటీ సెంటర్లు!

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేల పక్కన 5వేల వేసైడ్ ఎమినిటీ(WSA) సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసే వారు, భారీ వాహనాల డ్రైవర్లు వీటిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రతి 30-40kmsకి ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల్లో పార్కింగ్ స్థలం, ఫుడ్, ఫ్యూయెల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం గత వారం విడుదల చేసింది.
News August 7, 2025
జిల్లాల్లో మార్పులపై నెలలో నివేదిక: CM

APలో కొత్త జిల్లాలు, మండలాలు, సరిహద్దుల మార్పులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని CM చంద్రబాబు ఆదేశించారు. సరిహద్దు మండలాల విలీన సమస్యకు పరిష్కారం, కొత్త మండలాలు ఏర్పాటు, జిల్లా, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్పు వంటి వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. అక్టోబర్ ఆఖరులోపే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
News August 7, 2025
రాజగోపాల్ రెడ్డికి నోటీసులు?

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారు. రేవంత్పై విమర్శల మీద వివరణ కోరనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.