News April 22, 2025

ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి

image

J&k పహల్గామ్‌లో ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.

Similar News

News April 23, 2025

ఉగ్రదాడి.. ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి

image

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించారు. విశాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి <<16187025>>చంద్రమౌళితోపాటు<<>> కావలి(నెల్లూరు జిల్లా)కి చెందిన మధుసూదన్ కూడా తూటాలకు బలయ్యారు. బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి ఇటీవల కశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లారు. హైదరాబాద్‌ SIB కార్యాలయంలో పనిచేస్తున్న మనీశ్ రంజన్(బిహార్ వాసి) కూడా కాల్పుల్లో చనిపోయారు.

News April 23, 2025

టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

News April 23, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు: పొంగులేటి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చ.అ.లకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

error: Content is protected !!