News April 23, 2025

పార్వతీపురం మన్యం: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

నేడు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 220 పాఠశాలల నుంచి 10,455 మంది పరీక్ష రాయగా వారిలో 5,055 మంది బాలురు, 5,312 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 10,367 మంది కాగా ప్రైవేట్‌గా 88 మంది పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా 67 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

Similar News

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

రేపు యథావిధిగా ‘మీకోసం’: కలెక్టర్‌

image

అమలాపురంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు.

News April 19, 2026

కృష్ణా: Way2Newsలో ఉద్యోగ అవకాశాలు

image

కృష్ణా జిల్లాలో మండలాల వారీగా Way2Newsలో పని చేయడానికి రిపోర్టర్‌లు కావలెను. అర్హత: ఏదైనా ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల వారు <>ఈ లింక్‌ను క్లిక్ చేసి చేసి<<>> వివరాలు నమోదు చేయండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.