News April 23, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 23, 2025
వెంటిలేటర్పై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే?

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత వీరయ్య చౌదరిపై హత్య జరిగడంతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆయన్ను ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. ECG తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. హరిబాబు హెల్త్ అప్డేట్పై హోం మంత్రి అనిత ఆరా తీశారు.
News April 23, 2025
ఒంగోలు: వార్డు మెంబర్ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి వరకు

ఒంగోలులో దారుణంగా హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఈయన 2013 నుంచి 2018 వరకు అమ్మనబ్రోలు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్గా ఎన్నికై అనంతరం ఉపసర్పంచ్గా ఉన్నారు. అనంతరం చవటపాలెం ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నాగులుప్పలపాడు ఎంపీపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
News April 23, 2025
నేడు ప్రకాశం జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడంతో వారి మృతదేహానికి నివాళి అర్పించడానికి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రానున్నారు. అంతిమయాత్రలో సీఎం పాల్గొంటారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.