News April 23, 2025
MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజీ విద్యార్థులు

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా మోడల్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో బి.సాయి సుష్మ 462/470(ఎంపీసీ), జె.మధుమిత 426/440(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), కే.అనిల్ 839/1000(ఎంపీసీ), కె.మహేశ్వరి 952/1000(బైపీసీ), ఈ.సాయి దుర్గేశ్ 934/1000(సీఈసీ) ఉత్తమ ఫలితాలు సాధించారు.
Similar News
News April 23, 2025
10th RESULTS: మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 10,286 మంది పరీక్ష రాయగా 9,659 మంది పాసయ్యారు. 5,009 మంది బాలురులో 4,617(92.17%) మంది, 5,277 మంది బాలికలు పరీక్ష రాయగా 5,042(95.55%) మంది పాసయ్యారు. 93.90% పాస్ పర్సంటైల్తో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా టాప్లోనే ఉంది.
News April 23, 2025
10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
కరోనాను జయించి.. IASగా సత్తా

తాజా UPSC ఫలితాల్లో నారాయణవనం మండల వాసి సురేశ్ 988 ర్యాంక్తో సత్తా చాటిన విషయం తెలిసిందే. 2021లో ఆయన కరోనా బారిన పడ్డారు. కోలుకునే క్రమంలో వినికిడి సమస్యను ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదలని ఆయన ఏడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం అంటే ఇష్టం అన్న ఆయన.. సమాజానికి తన వంతు కృషి చేస్తానన్నారు.