News April 23, 2025

‘వేవ్స్’తో మీ ఆలోచనలు పంచుకోండి: చిరంజీవి

image

ముంబై వేదికగా మే 1 నుంచి 4 వరకు వరల్డ్ విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమ్మిట్(వేవ్స్)ను కేంద్రం నిర్వహించనుంది. ఇది ప్రతిభను నిరూపించుకునే ఓ వేదిక అని వేవ్స్ బోర్డు సభ్యుడు చిరంజీవి చెప్పారు. ఈ సదస్సు నటుల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కావొచ్చన్నారు. http://www.wavesindia.org/లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఈవెంట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ప్రొడక్ట్స్ గురించి ఆలోచనలు పంచుకోవాలని కోరారు.

Similar News

News August 9, 2025

ట్రంప్, పుతిన్ భేటీ.. స్వాగతించిన భారత్

image

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ ఈ నెల 15న అలాస్కాలో భేటీ కానున్న విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘US, రష్యన్ ఫెడరేషన్ అలాస్కాలో సమావేశమయ్యేందుకు ముందుకు రావడాన్ని ఇండియా స్వాగతిస్తోంది. ఈ భేటీతో యుద్ధానికి తెరపడి ఉక్రెయిన్‌‌లో శాంతికి దారులు తెరుచుకునే అవకాశం ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని PM మోదీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

News August 9, 2025

నిర్మాతలతో కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలం

image

వేతనాల పెంపుపై <<17354311>>నిర్మాతలతో<<>> కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని, 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ను విభజించేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పారు.

News August 9, 2025

పులివెందులలో గతంలో ఆ పరిస్థితి లేదు: ప్రత్తిపాటి

image

AP: ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని చెప్పారు. రౌడీ ముఠాలను తరిమేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కడప(D) ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలిపారు. ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.