News April 23, 2025
నిర్మల్: పేదింటి అమ్మాయిలకు స్టేట్ ర్యాంకులు

పేద కుటుంబాల నుంచి వచ్చి గురుకులాల్లో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు నిర్మల్ అమ్మాయిలు. శాంతినగర్ గురుకుల బాలికల కళాశాలల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో అక్షయ 435, విజయలక్ష్మి, కీర్తన 433, వైష్ణవి 432 మార్కులు సాధించారు. ఎంపీసీలో శార్వాణి, శ్రీవల్లి 465, సంధ్యారాణి, వర్షిని 464, కీర్తన 463 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
Similar News
News April 23, 2025
పది ఫలితాలలో 13 నుంచి 8వ స్థానానికి ఎన్టీఆర్ జిల్లా

2024- 25లో పది పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 88.76% ఉత్తీర్ణత శాతంతో 13వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడు 5 స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకుంది. జిల్లాలో 27,467 మంది పరీక్షలు రాయగా 23,534(85.68) మంది పాసయ్యారు. మండలాలవారీగా ఉత్తీర్ణత శాతం తెలియాల్సి ఉంది.
News April 23, 2025
HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.
News April 23, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ప.గో. జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ప.గో.జిల్లా మెరుగుపడగా ఏలూరు జిల్లా కాస్త తగ్గింది. ➤ ప.గో.జిల్లాలో గతేడాది 81.82% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 82.15% శాతంతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 80.08% శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 77.24% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది.